బెంగుళూరు: బెంగుళూరులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామిలను ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు కుమారస్వామి తెలిపారు. కన్నడ భాషలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం అనేక మంది నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నట్లు ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్లు కర్నాటక మాజీ సీఎం అన్నారు. దేశాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కొత్త ఫ్రంట్కు ప్రయత్నిస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం మార్పు అవసరం అని, పేద ప్రజల కోసం కూడా మార్పు కావాలని కేసీఆర్ కాంక్షిస్తున్నారని హెచ్డీ కుమారస్వామి తెలిపారు.