KCR : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావుకు నివాళులు అర్పించారు. జోగినపల్లి శ్రీనివాసరావు దశదిన కర్మ కార్యక్రమం నేపథ్యంలో కేసీఆర్ ఇవాళ కొంపల్లిలోని జోగినపల్లి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు.
కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన శ్రీనివాసరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఇటీవల సికింద్రాబాద్ యశోద దవాఖానలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 14న తుదిశ్వాస విడిచారు. కేసీఆర్ సతీమణి శోభమ్మకు జోగినపల్లి శ్రీనివాసరావు స్వయానా సోదరుడు. ఈ నెల 14న జోగినపల్లి శ్రీనివాసరావు అంత్యక్రియల్లో కూడా కేసీఆర్ పాల్గొన్నారు. ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన కేసీఆర్ https://t.co/eCJ3l3UtP2 pic.twitter.com/nQEndx4qTv
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2026