హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా, పోస్ట్ గ్రాడ్యూయేషన్(పి.జి.)లో ప్రవేశాలు పొందటానికి నిర్వహించే సీపీజీఈటీ-2026 కన్వీనర్గా కేయూ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కట్ల రాజేందర్ను నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు.
రాజేందర్ గతంలో కామర్స్కళాశాల ప్రిన్సిపాల్గా, పాఠ్య ప్రణాళిక అధ్యక్షుడిగా, ఖమ్మం పి.జి.కాలేజీ ప్రిన్సిపాల్గా, సెల్ఫ్ ఫైనాన్సు కోర్స్ డైరెక్టర్గా, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం రాజేందర్ విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారిగా, కామర్స్ విభాగ డీన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు రాజేందర్ను అభినందించారు.