బెల్గావి: కర్నాటకలోని బెల్గావి జిల్లాలో ఓ మఠంలో లింగాయ్ గురువు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. శ్రీ గురు మదివాలేశ్వర్ మఠానికి చెందిన బసవ సిద్ధలింగ స్వామి తన క్వార్టర్లో ఉరివేసుకుని చనిపోయారు. క్వార్టర్లో వేలాడుతున్న ఆయన దేహాన్ని మఠంలోని అటెండర్లు గుర్తించారు. ఆ గురువు రూమ్లో పోలీసులు సూసైడ్ నోట్ను రికవరీ చేశారు. దేని వల్ల ఆయన చనిపోయారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నోట్లో ఏముందో కూడా ఇంకా తెలియలేదు. కొన్ని మఠాల్లో జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఇద్దరు మహిళలు చర్చిస్తున్న వీడియోను ఆ గురువు చూసినట్లు కొందరు చెప్పుకుంటున్నారు. ఆ వీడియోలో ఓ మహిళ సిద్ధలింగ పేరును కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం మురుఘా మఠానికి చెందిన శివమూర్తి శరణారును లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.