ధర్మపురి, నవంబర్ 24: దవాఖానలో నార్మ ల్ డెలివరీలకే ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డా.అజయ్కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను గురువారం ఆయన పరిశీలించారు. దవాఖానలో పలు వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యం లో అందించే కేసీఆర్ కిట్తో పాటు ఆర్థిక సాయం అందుతుందా లేదా అరి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రంలో ప్రసవ మరణాలు సున్నా శాతానికి చేరాయన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయని, ప్రభుత్వ దవాఖాన సేవలను ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కమిషనర్ వెంట వైద్యులు, తదితరులున్నారు.
నర్సింహస్వామివారి సన్నిధిలో పూజలు
ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామివారి సన్నిధిలో రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న కమిషనర్కు దేవాలయ సిబ్బంది మేళతాళాల మధ్య స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు పూజలు చేసి ఆశీర్వదించారు. ఆశీర్వచన మండపంలో రెనొవేషన్ కమిటీ సభ్యుడు ఇం దారపు రామయ్య స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఇక్కడ రెనొవేషన్ కమిటీ సభ్యుడు గుంపుల రమేశ్, వేదపండితుడు బొజ్జ రమేశ్శర్మ, ముఖ్య అర్చకుడు రమణయ్య, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ ఉన్నారు.