రిత్విక్, చిత్రాశుక్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘కళింగపట్నం జీవా’. పి.నానిబాబు దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను యువ నిర్మాత రాహుల్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందదర్భంగా చిత్ర హీరో, నిర్మాత రిత్విక్ మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథ ఇది. ఇందులో హీరోకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. కొవిడ్ సమయంలో ఎన్నో కష్టాలకోర్చి ఈ సినిమాను పూర్తిచేశాను. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అన్నారు. బిందు భార్గవి, ఉమా మహేశ్వరరావు, అంబటి శ్రీనివాస్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బన్నీ అండ్ నానాజీ, సంగీతం: శుభంకర్, కథ, నిర్మాత: రిత్విక్ చిల్లికేశల, దర్శకత్వం: పి. నానిబాబు.