కాళేశ్వరం కూలిపోయిందంటూ విష ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్ పెద్దలే నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ‘ఎస్సారెస్పీ పునర్జ్జీవ’ పథకంతో నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. మూడు రోజులుగా ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు ఎత్తిపోతలు కొనసాగుతుండగా శనివారం ఉదయం నుంచి రాంపూర్ పంప్హౌస్ను నడుపుతూ వరదకాలువ ద్వారా ఎగువన ఉన్న ఎస్సారెస్పీ వైపు నీటిని తరలిస్తున్నారు.