జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్
హైదరాబాద్: జమ్ము వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖ స్వర్ణ పతకాలతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ ఫైనల్లో సురేఖ 146-143 తేడాతో ప్రియా గుర్జార్(రాజస్థాన్)పై అద్భుత విజయంతో పసిడి ఒడిసిపట్టుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్లోనూ త్రిషాదేబ్(ఆర్ఎస్పీబీ)పై సురేఖ 148-143తో విజయం సాధించింది. ర్యాంకింగ్ రౌండ్లోనూ సురేఖ 699/720 స్కోరుతో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవరాల్గా ఈ తెలుగు ఆర్చర్ జాతీయ చాంపియన్గా నిలువడం ఇది ఆరోసారి కావడం విశేషం.