హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఏపీ హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత సోమవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ఉదయం పదిన్నరకు మొదటి కోర్టుహాల్లో ఆమెతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె రాకతో హైకోర్టు న్యాయమూర్తుల (సీజే కలిపి) సంఖ్య 19కి చేరింది.