అహ్మదాబాద్: భారత్ నిర్దేశించిన 225 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ లక్ష్యం దిశగా సాగుతోంది. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ జేసన్ రాయ్(0) వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. వన్డౌన్లో వచ్చిన డేవిడ్ మలన్(64) మెరుపు అర్ధశతకం బాది ఇన్నింగ్స్కు గట్టిపునాది వేశాడు. మరో ఎండ్లో బట్లర్(51) ఆచితూచి ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లకు ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 48 బంతుల్లో 98 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో వికెట్లు ఉండటంతో ఆఖర్లో చెలరేగనుంది.