మక్తల్ టౌన్, అక్టోబర్ 23 : ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మున్సిపల్ చైర్పర్సన్కు లేదని టీఆర్ఎస్ కౌన్సిలర్లు అన్నారు. పట్టణంలోని ఐబీ అతి థి గృహంలో శనివారం టీఆర్ఎస్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూర్, అమరచింత అభివృద్ధిలో ముందుకు సాగుతుంటే మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం బీజేపీ మున్సిపల్ చైర్పర్స న్ కాదన్నారు. మున్సిపాలిటీలో రెవెన్యూ పెంచుకోమని ఎమ్మెల్యే చిట్టెం ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టి పైగా అభివృద్ధికి నిధులు లేవన్నారు. మక్తల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే చొరవతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ భర్త ప్రతి విషయంలో రాజకీయం చేస్తున్నాడని, కార్మికుల వద్ద లక్షలు దండుకున్నది ఎవరు అనేది ప్రజలకు బా గా తెలుసు అని అన్నారు. అదేవిధంగా మహిళల పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు తీ వ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేను విమర్శిస్తే మేము చూస్తు ఊరుకోమన్నారు. ఎమ్మెల్యే ను విమర్శించే ముందు తమ పరిధి ఎంతో తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎ క్కడైనా ఎప్పుడికైనా వెళ్లావచ్చవన్నారు. మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలని అరికట్టలేకపోయారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు శ్వే త, జ్యోతి, సల్తానా, మొగిలప్ప, రాములు, కో ఆ ప్షన్లు పద్మ, శంషొద్ద్దీన్ పాల్గొన్నారు.