హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -2 ఫలితాలు ఈ నెల 25న విడుదలకానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ ఫలితాలను విడుదల చేయనున్నది. ఇప్పటికే జేఈఈ మెయిన్ -2 తుది కీ విడుదలైంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్ -2 పరీక్ష నిర్వహించారు.
దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. జేఈఈ మెయిన్ 1, 2లో సాధించిన మెరుగైన సోరును పరిగణనలోకి తీసుకొని మెరిట్ లిస్ట్ను ఎన్టీఏ విడుదల చేయనున్నది.