న్యూఢిల్లీ : జేఈఈ మెయిన్ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షలు ఆగస్ట్ 26, 27, 31, సెప్టెంబర్ ఒకటి, రెండు తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం తెలిపారు. విద్యార్థుల డిమాండ్ మేరకు పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మూడు, నాలుగో విడుత జేఈఈ మధ్య సమయం ఇచ్చామని, ఈ మేరకు నాలుగు వ్యవధిని ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మరో వైపు దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు సైతం పొడగించినట్లు చెప్పారు.
జేఈఈ 2021 సెషన్కు ఇప్పటికే 7.32లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మూడో విడుత ఈ నెల 20 నుంచి 25 వరకు, నాలుగో విడుత ఈ నెల 27 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే, కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా పరీక్ష వాయిదా పడింది. జేఈఈ మొదటి, రెండో విడుత సెషన్లు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. మహమ్మారి నేపథ్యంలో పరీక్షలు జరిగే నగరాల సంఖ్యను 232 నుంచి 334కు పెంచిన విషయం తెలిసిందే.