డైరెక్టర్, హీరో టాలీవుడ్ కు ఇటీవలే మంచి హిట్ ఇచ్చారు. ఇద్దరూ తమ మొదటి సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇపుడు మంచి జోష్ మీదున్న ఆ ఇద్దరూ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా..? ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ. అనుదీప్-వైష్ణవ్ తేజ్ కాంబోలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అడ్వాన్స్ కింద కొంత మొత్తంలో డబ్బు కూడా అందజేశారట.
ప్రస్తుతం క్రిష్తో చేస్తున్న సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు వైష్ణవ్ . ఈ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే అనుదీప్ చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. జాతిరత్నాలు సినిమా మంచి టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా..ఉప్పెన ఇప్పటికే 50 కోట్లకుపైగా షేర్ మార్కును దాటింది. టాలీవుడ్ కు రెండు హిట్స్ ఇచ్చిన వైష్ణవ్తేజ్-అనుదీప్ కేవీ ఎలాంటి హిట్ ఇస్తారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.