జమ్మికుంట, నవంబర్ 24: హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈటల రాజేందర్కు పోలీసులు బుధవారం నోటీసులు అందజేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్, పట్టణంలోని గాంధీచౌక్ వద్ద సమావేశాలు ఏర్పా టుచేశారు. వెయ్యి మందికంటే ఎక్కువగా జన సమీకరణ చేయొద్దన్న నిబంధనలను పట్టించుకోకుండా మీటింగ్లు పెట్టారు. ఎన్నికల పర్యవేక్షణ అధికారులు ఈ విషయాన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘన కింద ఈటలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో ఈటలకు నోటీసులు జారీ చేశారు.