మెట్పల్లి, నవంబర్ 24: అందరి సహకారంతో పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తెలిపా రు. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా జరిగేలా చూడాలని, స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.50 కోట్ల వ్యయంతో పట్టణ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అంతకుముందు కౌ న్సిల్ సభ్యురాలు బాల్క ముత్తమ్మ మాట్లాడుతూ, బాలకిషన్నగర్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ, శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మించాలని, పారిశుధ్య కార్మికుల పీఎఫ్ డబ్బులు జమ చేయాలని కోరారు.
పెండింగ్లో ఉన్న నల్లా బిల్లలు వసూ ల్ చేయాలని, పట్టణంలో స్వైరవిహారం చేస్తున్న పందులు, కుక్కులు, కోతుల బెడదను అరికట్టాలని 23వ వార్డు కౌన్సిలర్ బుచ్చిరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. వీరితో పాటు పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లోని సమస్యలను ప్రస్తావించారు. అనంతరం సమావేశంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా చేతులెత్తి ఆమోదం తెలిపారు. సమావేశంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రావు, ఇన్చార్జి కమిషనర్ రాజ్కుమార్,కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షిస్తాం
వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షిస్తామని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. పట్టణంలోని మద్దుల చెరువు సమీపంలోని వక్ఫ్ బోర్డు స్థలంలో నూతనంగా నిర్మించిన గదిని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను కబ్జా కోరల నుంచి విడిపిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కబ్జాకోరుల నుం చి బోర్డుకు చెందిన భూములను స్వాధీనం చేసుకునేందు కు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో వినోద్కుమార్, మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, సీఐ రాజశేఖర్రాజు, ఎంపీపీ తోట నారాయణ, జిల్లా సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, వక్ఫ్ బోర్డు ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎంఏ నయీం, ఈద్గా కమిటీ అధ్యక్షుడు అస్రార్, నాయకులు నయీమొద్దీన్, మహ్మద్ ఖతర్, ఎం డీ ఖయ్యూం, నజీబొద్దీన్, రఫీ, వసీం, ఇలియాస్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.