మల్యాల, మార్చి 10 : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన మహిళ దుర్మరణం చెందా రు. మల్యాల మండల కేం ద్రానికి చెందిన కే అశోక్, విజయ దంపతులు. ఉపా ధి కోసం అమెరికా వెళ్లా రు. అక్కడి ఓ సూపర్మార్కెట్లో పనిచేస్తున్న విజయ గురువారం పనులు ముగించుకొని, ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమం లో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విజయ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నా వీసా వివరాలు, స్పాన్సర్షిప్ వివరాలు ఎంబసీలో నమోదుకాలేదని తెలిసింది.
మారేడ్పల్లి, మార్చి 10: ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను ఇటీవలే పూర్తి చేసి.. ఉద్యోగంలో చేరిన హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు అక్కడి స్విమ్మింగ్పూల్లో ముని గి మరణించారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ ప్రాంతానికి చెందిన ఆర్ శ్రీనివాస్, అరుణ దంపతుల కుమారుడు సాయి సూర్యతేజ ఎంఎస్ కోసం 2019లో ఆస్ట్రేలియా వెళ్లారు. రెండు నెలల క్రితం చదువు పూర్తికావడంతో సివిల్ ఇంజనీర్గా అక్కడే ఉద్యోగంలో చేరారు. ఈ నెల 7న ఆస్ట్రేలియా లల తాను నివాసం ఉండే గోల్డెన్ కాస్ట్ రిసార్ట్లోని సిమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు పడిపోయి మరణించారు.