హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): పార్టీలో సొంత సినిమా చూపిస్తానంటే ఊరుకొనేది లేదని, ఎవడో వచ్చి కాంగ్రెస్ పార్టీని లేపాల్సిన అవస రం లేదని, పార్టీ ఎప్పుడూ పటిష్ఠంగా ఉంటుందని కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలుచేశా రు. వాళ్ల చరిత్ర మొత్తం బయటపెడతానని హెచ్చరించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. తాను క్రమశిక్షణ ఉల్లంఘించానంటూ చిన్నారెడ్డి చేసిన వ్యా ఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి కనుసన్నల్లోనే చిన్నారెడ్డి నడుస్తున్నారన్నారు. పార్టీ సీనియర్నేత శశిథరూర్ను తిట్టినప్పుడు, పీసీసీ అధ్యక్షుడు కాకముందే ప్రచారం చేయించుకొన్నప్పుడు రేవంత్రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అప్పుడు ఈ క్రమశిక్షణ కమిటీ ఎటు పోయిందని నిలదీశారు. తాను కోవర్ట్ అయితే రేవంత్రెడ్డి కూడా కోవర్టేనని అన్నారు. ఓవైపు పార్టీ కోసం కొట్లాడుతుంటే కోవర్ట్ అంటారా? అని ప్రశ్నించారు.
సంగారెడ్డికి వచ్చిన మంత్రి కేటీఆర్ను కలిసి తన నియోజకవర్గ అభివృద్ధికి రూ.900 కోట్లు కేటాయించాలని కోరినట్టు తెలిపారు. అభివృద్ధి కోసం మంత్రిని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. గతంలో ఓ సందర్భంలో మం త్రి కేటీఆర్, రేవంత్రెడ్డి కూడా కలిశారని, దీన్ని ఏమంటారని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్లోకి వెళ్లాలనుకుంటే నేరుగా వెళ్లిపోతానని, తనను ఆపేవాళ్లు ఎవరున్నారని ప్రశ్నించారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్పార్టీలో నే ఉంటానని స్పష్టం చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి మాట్లాడాలని, లేకుంటే తోడ్కలు తీస్తానని హెచ్చరించారు. తమషా చేస్తున్నారా? బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అని మండిపడ్డారు. తీన్మార్ మల్లిగాడు పెద్ద తోపు అనుకుంటుండని, వాడి బ్లాక్ మెయిల్ సంగతంతా తనకు తెలుసని అన్నారు. మల్లిగాడు పూర్తిగా దిగజారిపోయిండన్నారు. తనను ఏజెం ట్ అనడానికి వాడెవడని మండిపడ్డారు. ఐదో తేదీన జరిగే పార్టీ సమావేశంలో అన్ని అంశాలపై మాట్లాడుతానని తెలిపారు. ఒకవేళ తనను హైకమాండ్ పక్కన పెట్టినా పర్వాలేదని అన్నారు.