బేగంపేట్, ఫిబ్రవరి 11: అవయవదానంపై అవగాహన పెరగాలని సినీ నటుడు జగపతిబాబు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కిమ్స్ దవాఖానలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో అవయవ మార్పిడికోసం బాధితులు లక్షల్లో ఉంటే, దాతల సంఖ్య వందలు, వేలల్లోనే ఉంటున్నదని చెప్పారు. తన జన్మదినం సందర్భంగా మరణానంతరం తాను అవయవదానం చేయనున్నట్టు వెల్లడించారు. ఆయనతోపాటు ఆయన అభిమానులు మరో వంద మంది సైతం అవయవదానం చేస్తామని వేర్వేరు చోట్ల ప్రతిజ్ఞ చేశారు. అభిమానులంతా అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని జగపతిబాబు పిలుపునిచ్చారు. అవయవదానానికి ముందుకురావటం సాహసోపేతమైన నిర్ణయమని కిమ్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు అన్నారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, జీవన్దాన్ ఇన్చార్జి, నిమ్స్ అడిషినల్ ప్రొఫెసర్ డాక్టర్ సరస్వతి, అవయవమార్పిడి నిపుణులు పాల్గొన్నారు.