మాచో స్టార్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. ప్రముఖ కన్నడ దర్శకుడు ఏ హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పలు పోస్టర్లు గోపీచంద్ను యాక్షన్ ప్యాక్డ్ అవతార్లో ప్రజెంట్ చేశాయి. మూవీ మేకర్స్ బుధవారం టీజర్ అప్డేట్ ఇచ్చారు. ‘భీమా’ టీజర్ను ఈ నెల 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్లో గోపీచంద్ చైర్లో కూర్చున్న లుక్ ఇంటెన్స్గా ఉంది. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తుండగా, ఆయన సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కెమెరా: స్వామి జే, నిర్మాత: కేకే రాధామోహన్, దర్శకత్వం: ఏ హర్ష.