న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీకి భారత సీనియర్ పేసర్ ఇషాంత్శర్మ దూరమవగా.. అండర్-19 ప్రపంచకప్లో జట్టును విజయపథాన నడిపిన యశ్ ధుల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. బుధవారం రంజీ ట్రోఫీకి ఢిల్లీ ప్రకటించిన జట్టులో యశ్కు స్థానం లభించింది. ఈనెల 17 నుంచి మొదలవుతున్న టోర్నీలో లెఫ్టార్మ్ పేసర్ ప్రదీప్ సాంగ్వాన్ నాయకత్వంలో బరిలోకి దిగనున్న ఢిల్లీ జట్టులో భారత ప్లేయర్లు నవ్దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్కు చోటు లభించింది. అయితే ప్రపంచకప్ అనంతరం ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండానే యువ క్రికెటర్ యశ్ నేరుగా ఈ టోర్నీలో పాల్గొంటున్నాడు.
జట్టు: ప్రదీప్ సాంగ్వాన్, నితీశ్, ధ్రువ్, ప్రియాన్ష్, యశ్, క్షితిజ్, సిద్ధు, హిమ్మత్, లలిత్, అనుజ్, లక్ష్యయ్, నవ్దీప్, సిమర్జిత్ సింగ్, మయాంక్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వికాస్ మిశ్రా, శివాంగ్ వశిష్ట్, శివమ్ శర్మ. రిజర్వ్: దేవ్ లక్రా, హృతిక్.