టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆదిలోనే భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా, సూర్యకుమార్కు బదులుగా ఈ మ్యాచ్లో ఆడుతున్న ఇషాన్ కిషన్.. అవుట్ అయ్యాడు. బౌల్ట్ బౌలింగ్లో మిచెల్కు క్యాచ్ ఇచ్చి కిషన్ పెవిలియన్ చేరాడు. 8 బంతుల్లో కిషన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు.
ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఉన్నారు. 3 ఓవర్లకు టీమిండియా ఒక వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. 9 బంతుల్లో కేఎల్ రాహుల్ 7 పరుగులు చేశాడు.