ఆస్తులు కాపాడుకోవడానికే ఈటల రాజేందర్ బీజేపీలో చేరిండు. ఆత్మగౌరవం ఉన్నోడివైతే ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సింది. నువ్వు గెలిస్తే ప్రధాని మోదీతో మాట్లాడి నిత్యావసరాల ధరలు తగ్గించే దమ్ముందా? బీజేపీ వాళ్లు ఓట్ల కోసం వస్తే పెరిగిన ధరల గురించి నిలదీయాలి. దేశంలోని 35 ప్రభుత్వరంగ సంస్థల్లో 25 సంస్థలను కార్పొరేట్ వ్యాపారులకు అమ్మిన మోదీకి ఓటుతో బుద్ధి చెప్పాలి.