IPL | ఐపీఎల్ రెండో సీజన్ ప్రారంభమైంది. దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ షురూ అయ్యింది. సీఎస్కే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్లోనే సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. డూప్లెసిస్(0)కే ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్లో మిల్నేకు క్యాచ్ ఇచ్చి డక్కౌట్ అయ్యాడు.
అంతలోనే సీఎస్కేకు రెండో షాక్ తగిలింది. క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ కూడా ఖాతా తెరవకుండానే వికెట్ సమర్పించుకున్నాడు. మిల్నే బౌలింగ్లో సౌరభ్ తివారీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు కాస్త ఇబ్బంది ఫీలయ్యాడు. దీంతో రాయుడు స్థానంలో రైనా ఎంట్రీ ఇచ్చాడు. ఫోర్ కొట్టి ఊపు మీద కనిపిస్తాడనుకున్నా, బౌల్ట్ బౌలింగ్లో చాహర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్, ధోనీ ఉన్నారు.