సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): జాతీయ సాంస్కృతిక చిహ్నాలైన వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఇతోధికంగా కృషి చేస్తున్న ఇం టాక్ సంస్థకు తెలంగాణ చాప్టర్ కో కన్వీనర్గా వ్యవహరిస్తున్న అనూరాధారెడ్డికి ‘పర్యాటన్ టు డే’ పురస్కారం లభించింది. గురువారం ఆన్లైన్లో జరిగిన ఇంటాక్ (ద నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమెకు ఈ అవార్డు దక్కింది. పర్యాటక, వారసత్వ, చారిత్రక సంపద పరిరక్షణలో ఆమె చేస్తున్న కృషికి గా ను ఈ అవార్డు అందిస్తున్నట్టు జాతీయ పత్రిక ‘పర్యాటన్ టుడే’ పేర్కొన్నది. వారసత్వ సంపద పై దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న వారిలో 22 మంది కి ఈ అవార్డులను ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచి అనురాధారెడ్డి ఉండటం విశే షం. ‘ఏవియేషన్ ఇన్ ది హైదరాబాద్ డొమినియెన్స్’ పుస్తకంతో దేశంలోనే తొలి వైమానిక చరి త్ర రచయితగా ఆమె ప్రసిద్ధి చెందారు. వారసత్వ సంపద, చేనేత వృత్తులు, పురాతన శిలాజం, ప్రాంతాల చరిత్రపై ఆమె కొన్నేండ్లుగా పరిశోధన చేస్తున్న విషయం తెలిసిందే.