MS Dhoni | చెన్నై: అభిమానం వెర్రితలలు వేయడమంటే ఇదేనేమో! చెన్నై సూపర్కింగ్స్ దిగ్గజ క్రికెటర్ ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఓ వీరాభిమాని చేసిన పని అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. కోల్కతా-చెన్నై మ్యాచ్ కోసం సదరు ఫ్యాన్..తన పిల్లల స్కూల్ ఫీజును వాడాడు. అది కూడా బ్లాక్లో ఏకంగా 64,000 పెట్టి టికెట్లు కొని మరీ మ్యాచ్ చూశాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత టికెట్ల కోసం ఇలా స్కూల్ ఫీజు వాడనని అతను చెప్పుకురావడం ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. ధోనీ ఆటను స్టేడియంలో చూసేందుకు ఇలా చేశానన్న అతను ముగ్గురు పిల్లలు చాలా సంతోషించారని పేర్కొన్నాడు. అయితే పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాల్సిందిపోయి ఇదేం పిచ్చి పని అంటూ సదరు అభిమానిపై దుమ్మెత్తిపోస్తున్నారు.