UK PM Boris Johnson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు స్వదేశంలో విపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇటీవల భారత్లో పర్యటించిన బోరిస్ జాన్సన్.. గుజరాత్ రాష్ట్రంలో ఓ జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అటుపై అక్కడ ఉన్న బుల్డోజర్ మీదకెక్కి అభివాదం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మత ఘర్షణల నేపథ్యంలో పలు ఇండ్లు, దుకాణాలను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం వివాదాస్పదమైంది. ఈ తరుణంలోనే బోరిస్ జాన్సన్ ప్రవర్తనను బ్రిటన్ ఎంపీలు కూడా తప్పుబట్టారు.
విపక్ష లేబర్ పార్టీ ఎంపీ జారా సుల్తానా మాట్లాడుతూ.. భారత్ పర్యటనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రధాని మోదీని ప్రశ్నించడంలో బోరిస్ జాన్సన్ విఫలమయ్యారని విమర్శించారు. దీనికి బదులుగా జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించార్నారు. దీంతో మానవ హక్కులపై జాన్సన్కు ఎంత శ్రద్ధ ఉందో అర్థం అవుతుందన్నారు.
మరో ఎంపీ నాదియా విటోమ్ స్పందిస్తూ.. ‘బోరిస్ జాన్సన్ ఇటీవల భారత పర్యటనలో జేసీబీల పక్కన నిలబడి ఫోజులు ఇచ్చారు. కానీ భారత్ ప్రధాని మోదీతో ఇండ్ల కూల్చివేతలపై ప్రశ్నలు లేవనెత్తారో లేదో చెప్పలేదు’ అని అన్నారు. మోదీ ప్రభుత్వ చర్యలకు చట్టబద్ధత కల్పించేందుకు తన భారత పర్యటన దోహదపడిందని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు.