హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): దైనందిన జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరం. ఆరోగ్యకరమైన జీవనానికి ఇది సోపానం లాంటిది. కానీ, కొత్తగా తల్లి అయినవారిలో చాలా మంది నిద్రలేమితో సతమతమవుతున్నారట. ప్రత్యేకించి హైదరాబాద్లో 97% మంది తల్లులు ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ‘బెడ్డీ-మామ్స్ ప్రొస్సో’ సర్వేలో తేలింది. చంటి పిల్లల సంరక్షణ కోసం అధిక సమయాన్ని వెచ్చించాల్సి వస్తుండమే ఇందుకు కారణమని ఈ సర్వేలో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని (మే 8) పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ఈ సర్వే నిర్వహించారు.
హైదరాబాద్లోని తల్లుల స్పందనలు ఇవీ..