హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లోని చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ హత్య కేసులో బానోత్ శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి చర్లపల్లి జైలులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా గత రెండు రోజులుగా జైలులోని దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అయితే దవాఖానలోని బెడ్ షీట్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన హాస్పిటల్ సిబ్బంది జైలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 2019లో సూర్యాపేటలో జరిగిన హత్య కేసులో శ్రీనివాస్ నిందితుడు.