మల్కాజిగిరి, జనవరి 1: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మల్కాజిగిరి డివిజన్, విమలాదేవినగర్లో రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే అన్ని డివిజన్లలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పూర్తిచేశామని అన్నారు. వరద ముంపురాకుండా బాక్స్ డ్రైనేజీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతాలోపాలు జరుగకుండా నిర్మాణ పనులను అధికారులు పరిశీలిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ దీపక్, కార్పొరేటర్ ప్రేమ్కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, జీఎన్వీ సతీశ్కుమార్, పిట్ల శ్రీనివాస్, మోహన్రెడ్డి, నర్సింగ్, వినయ్గౌడ్, సంధ్య, జయశ్రీ, వసంత, శారద, శ్రీనివాస్రెడ్డి, శ్రీరామ్, సత్యనారా యణ, బ్రహ్మం, వెంకట్రాజు, తదితరులు పాల్గొన్నారు.