గౌహతి: ఇండిగో విమానం రన్వేపై స్కిడ్ అయ్యింది. అస్సాంలోని జోర్హట్ నుంచి కోల్కతాకు ఆ విమానం వెళ్లనున్నది. టేకాఫ్ సమయంలో విమానం స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. రన్వే పక్కన ఉన్న బురద మట్టిలో ఆ విమాన వీల్స్ ఇరుక్కపోయాయి. ఇండిగో 6ఈ757 ఫ్లయిట్ను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. సాంకేతిక కారణాల వల్ల ఆ విమానాన్ని అక్కడే నిలిపివేశారు. ఇండిగో విమానం స్కిడ్ అయిన ఫోటోను ఓ స్థానిక జర్నలిస్టు తన ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. విమానం స్కిడ్ అయిన సమయంలో దాంట్లో 98 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు.