బాలి: ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో మూడో సీడ్ సింధు 14-21, 21-15, 21-14తో సిమ్ యుజిన్ (కొరియా)పై విజయం సాధించింది. తొలి గేమ్లో ఓడిన సింధు తర్వాతి రెండు గేమ్లలో ప్రత్యర్థిపై విజృంభించింది. గంటా ఆరు నిమిషాల పాటు పోరాటం సాగించి సింధు విజయం సాధించింది. సెమీస్లో రెండో సీడ్ ఇంటానన్ (థాయిలాండ్)తో సింధు తలపడనుంది. పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం సెమీస్కు చేరింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 21-19, 21-19తో గోస్జెఫెయి-నుర్ ఇజాజుద్దీన్ (మలేషియా) జోడీని ఓడించి ముందంజ వేసింది. టాప్ సీడ్ మార్కస్ గిడియెన్- కెవిన్ సంజయ (ఇండోనేషియా) ద్వయంతో సాత్విక్-చిరాగ్ జోడీ సెమీస్ పోరు సాగించనుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో సాయిప్రణీత్ 12-21, 8-21తో అక్సెల్సన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగాడు.