ఫుకెట్: ఆసియాకప్ ఆర్చరీలో భారత్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. రికర్వ్ మిక్స్డ్ విభాగంలో భారత జోడీ పార్థ్ సాలుంకే, రిధీ పోర్ ఫైనల్లోకి ప్రవేశించి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పార్థ్, రిధీ 6-2(35-36, 39-33, 39-34, 39-38)తో మలేషియా ద్వయంపై గెలిచింది. శనివారం జరిగే పసిడి పతక పోరులో బంగ్లాదేశ్తో భారత్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు భారత్కు ఏడు పతకాలు ఖరారయ్యాయి. వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ అయిన ఇందులో దక్షిణకొరియా, చైనా, జపాన్, చైనీస్తైపీ జట్లు పోటీపడటం లేదు.