క్వీన్స్టౌన్: ఐదు వన్డేల సిరీస్ను ఇప్పటికే న్యూజిలాండ్కు చేజార్చుకున్న టీమ్ఇండియా నాలుగో వన్డేలోనూ విఫలమైంది. మంగళవారం వర్షం కారణంగా 20 ఓవర్లకే పరిమితమైన మ్యాచ్లో మిథాలీసేన 63 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓడింది. కివీస్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 17.5 ఓవర్లలో128 పరుగులకు కుప్పకూలింది. బ్యాటర్ రిచా ఘోష్(29 బంతుల్లో 52, 4 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగినా జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. కివీస్ బౌలర్లను దునుమాడుతూ 26 బంతుల్లోనే వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన భారత బ్యాటర్గా రిచా రికార్డులోకెక్కింది. అంతకుముందు అమెలియా కెర్(68 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో కివీస్ 20 ఓవర్లలో 191/5 స్కోరు చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కెర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.