హైదరాబాద్ , ఆట ప్రతినిధి: ఆసియా హ్యాండ్ బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు ట్రోఫీతో తిరిగిరావాలని భారత హ్యాండ్ బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్ మోహన్రావు పిలుపునిచ్చారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం భారత జట్టు సోమవారం సౌదీ అరేబియాకు పయనమైంది. అంతకుముందు జట్టు సభ్యులను జగన్ మోహన్రావు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తేజ్ రాజ్సింగ్ , వినయ్ సింగ్ , ఆనందీశ్వర్ పాండే పాల్గొన్నారు. 16 జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగుతున్న భారత హ్యాండ్బాల్ జట్టు మొదటి మ్యాచ్ లో ఆతిథ్య సౌదీ అరేబియాతో తలపడనుంది.