బాసెల్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ ఎస్ ప్రణయ్ స్విస్ ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ సూపర్-300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21-18, 15-21, 21-19తో సుపనిడా కాటెథాంగ్ (థాయ్లాండ్)పై విజయం సాధించగా.. పురుషుల సింగిల్స్ సెమీస్లో ప్రణయ్ 21-19, 19-21, 21-18తో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆంటోనీ గింటింగ్ను చిత్తు చేశాడు. గంటా 19 నిమిషాల పాటు సాగిన మహిళల సెమీస్లో సింధు సూపర్ స్మాష్లతో విజృంభించింది. రెండో గేమ్లో వెనుకబడ్డ తర్వాత నిర్ణయాత్మక మూడో గేమ్లో తెలుగమ్మాయి చెలరేగిపోయింది. ఆదివారం జరుగనున్న తుదిపోరులో నాలుగో సీడ్ బుసానన్ (థాయ్లాండ్)తో సింధు తలపడనున్నది.