న్యూఢిల్లీ: పోలిష్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్లు అనుపమ ఉపాధ్యాయ, కిరణ్ జార్జ్ చాంపియన్లుగా అవతరించారు. మహిళల సింగిల్స్ టైటిల్ను అనుపమ చేజిక్కించుకోగా.. పురుషుల పోరులో కిరణ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కిరణ్ 21-15, 21-14తో చియాహో లీపై అలవోక విజయం సాధించాడు. మహిళల తుది పోరులో నాలుగో సీడ్ అనుపమ 17-21, 21-14, 21-17తో భారత్కే చెందిన అదితి భట్పై నెగ్గి టైటిల్ పట్టేసింది. ఈ సీజన్లో ఒడిశా ఓపెన్లో విజేతగా నిలిచిన కిరణ్కు ఇది రెండో టైటిల్ కావడం విశేషం. నిరుడు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చాలెంజ్లోనూ 17 ఏండ్ల అనుపమ విజేతగా నిలిచి సత్తా చాటింది.