ఇస్లామాబాద్: ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిన తర్వాత ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు బదులిస్తూ పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఆగ్రహానికి లోనైన విషయం తెలిసిందే. ఓ దశలో ఆయన కోపంతో జర్నలిస్టు చేతిలో ఉన్న ఫోన్ను లాగేశారు కూడా. అయితే ఆ సంఘటన గురించి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. సదురు జర్నలిస్టు తమను రెచ్చగొట్టినట్లు వ్యాఖ్యలు చేసినట్లు రమీజ్ రాజా తెలిపారు. ఆ జర్నలిస్టు ప్రశ్న వేసిన తీరు సరిగా లేదని, ఆసియా కప్ ఫైనల్లో పాక్ ఓడితే అభిమానులు ఆగ్రహంగా ఉన్నట్లు అతనికి ఎలా తెలుసు అని రాజా ప్రశ్నించాడు. జర్నలిస్టు చేసింది రెచ్చగొట్టే వ్యాఖ్యలని, నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుంటే, ఆ ప్రశ్న ఎలా వస్తుందని అడిగాడు. అయినా అదో చిన్న ఘటన అని, దాని గురించి మరిచిపోవాలని రమీజ్ రాజా అన్నారు.