స్టావెంగర్: యువ ఇండియన్ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నమెంట్లో టైటిల్ను గెలిచాడు. గ్రూప్ ఏ చెస్ టోర్నీలో అతను 9 రౌండ్లలో 7.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. టాప్ సీడ్గా బరిలోకి దిగిన ప్రజ్క్షానంద తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. 9 రౌండ్లలో అతను ఓటమిని చవిచూడలేదు. ఇంటర్నేషనల్ మాస్టర్ వీ ప్రణీత్పై టోర్నీలో గెలిచి పాయింట్ల పట్టికలో ప్రజ్ఞానంద ముందున్నాడు. రెండవ స్థానంలో మార్సెల్ ఎరోమిస్కీ, మూడవ స్థానంలో జుంగ్ మిన్ సియో ఉన్నారు. ఇటీవల జరిగిన చెస్సేబుల్ టోర్నీలో నవంబర్ వన్ కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద గ్రూప్ ఏ టోర్నీలోనూ సూపర్ షో కనబరిచాడు. వచ్చే నెలలో చెన్నైలో జరగనున్న 44వ చెస్ ఒలింపియాడ్లో ఇండియన్ బీ జట్టులో ప్రజ్ఞానంద ఆడనున్నాడు.