బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదోవ టెస్టు నాలుగవ రోజున బర్మింగ్హామ్లో భారతీయ క్రికెట్ అభిమానులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫ్యాన్స్ను టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ వాళ్లు ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోమవారం ట్విట్టర్లోనూ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు స్పందించింది. తన ట్విట్టర్లో రియాక్ట్ అవుతూ ఈ అంశాన్ని దర్యాప్తు చేయనున్నట్లు ఈసీబీ తన ప్రకటనలో తెలిపింది. టెస్టు మ్యాచ్ సమయంలో జాత్యాంహకార ఆరోపణలు జరిగిన వస్తున్న వార్తల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఈసీబీ వెల్లడించింది. క్రికెట్లో రేసిజంకు ఆస్కారం లేదని, ఎడ్జ్బాస్టన్లో ఉన్న అందరితోనూ ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఈసీబీ తెలిపింది. ఇంగ్లండ్ క్రికెట్లో రేసిజం చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు గతంలో యార్క్షైర్ మాజీ స్పిన్నర్ అజీమ్ రఫీక్ తెలిపారు.
Racist behaviour at @Edgbaston towards Indian fans in block 22 Eric Hollies. People calling us Curry C**ts and paki bas****s. We reported it to the stewards and showed them the culprits at least 10 times but no response and all we were told is to sit in our seats. @ECB_cricket pic.twitter.com/GJPFqbjIbz
— Lacabamayang!!!!!!! (@AnilSehmi) July 4, 2022