న్యూఢిల్లీ: భారత సీనియర్ షట్లర్ అజయ్ జయరామ్ బ్యాడ్మింటన్కు వీడ్కోలు పలికాడు. డచ్ ఓపెన్లో వరుసగా రెండుసార్లు పురుషుల సింగిల్స్ విజేతగా.. కొరియా ఓపెన్లో రన్నరప్గా నిలిచిన అజయ్ భారత బ్యాడ్మింటన్కు విశేష సేవలు అందించాడు. రెండు దశాబ్దాల బ్యాడ్మింటన్ కెరీర్కు 34 ఏండ్ల జయరామ్ ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘కన్నీటితో.. గద్గద స్వరంతో ఈ విషయం రాస్తున్నా. బ్యాడ్మింటన్ పోటీల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా. ఇన్నాళ్లు నాకు సహకరించిన కుటుంబసభ్యులు, కోచ్లు, అభిమానులకు కృతజ్ఞతలు’ అని అజయ్ ట్వీట్ చేశాడు. అజయ్ జయరామ్ ఆసియా టీమ్ చాంపియన్షిప్స్-2016లో కాంస్యం నెగ్గగా.. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఒడిశా ఓపెన్లో చివరగా రాకెట్ పట్టాడు. వియత్నాం ఓపెన్-2018, కొరియా ఓపెన్-2015తోపాటు డచ్ ఓపెన్ 2010, 16లో రన్నరప్గా నిలిచాడు.