న్యూఢిల్లీ, మే 6: దేశీయంగా తయారైన తేలికరకం హెలిక్యాప్టర్ (ఏఎల్హెచ్) ధ్రువ్తో చేపట్టిన వైమానిక ప్రదర్శనను భారత సైన్యం శనివారం నిలిపివేసింది. గురువారం నాటి విన్యాసాల్లో ఏఎల్హెచ్ ధ్రువ్ హెలిక్యాప్టర్ జమ్ముకశ్మీర్లోని కిష్టవార్లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక టెక్నీషియన్ చనిపోగా, ఇద్దరు పైలట్లు తీవ్రగాయాల పాలయ్యారు. దీంతో ధ్రువ్తో చేపట్టిన వైమానిక ప్రదర్శనను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు మిలటరీ వర్గాలు తెలిపాయి. ధ్రువ్ హెలిక్యాప్టర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తటం ఇది మూడోసారి. ప్రమాద ఘటన నేపథ్యంలో టెక్నికల్గా అన్ని పరీక్షలు జరిపాకే వైమానిక ప్రదర్శనను తిరిగి ప్రారంభిస్తామని భారత సైన్యం ఓ ప్రకటనలో
తెలిపింది.