న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులు డిసెంబర్ 15 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ శుక్రవారం వెల్లడించింది. అంతర్జాతీయ విమాన రాకపోకలకు అవసరమైన చర్యలను తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు లేఖ రాసింది. దీంతో సర్వీసుల పునఃప్రారంభంపై డీజీసీఏ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. కరోనా ముప్పులేని దేశాలకు పూర్తి సామర్థ్యంతో సర్వీసులు నడుస్తాయని విమానయాన శాఖ పేర్కొన్నది.