IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యంపై కన్నేసింది. మూడో రోజు ఇంగ్లండ్ను 329 పరుగులకే కట్టడి చేసిన భారత్.. అనంతరం రెండో ఇన్నింగ్స్ ధాటిగా మొదలెట్టింది. అయితే.. జో రూట్ బౌలింగ్లో ఓపెనర్ రోహిత్ శర్మ(30) ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్(5), యశస్వీ జైస్వాల్(19)లు జాగ్రత్తగా ఆడారు. దాంతో, టీ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ 44 నష్టానికి రన్స్ కొట్టింది. ప్రస్తుతం రోహిత్ సేన 170 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓవర్నైట్ స్కోర్ 207/ 2 తో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 319 పరుగులకే ఆలౌటయ్యింది. లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగడంతో టపటపా వికెట్లు కోల్పోయింది. పేసర్ సిరాజ్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో, టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది.
Tea on Day 3 in Rajkot!#TeamIndia move to 44/1, lead by 170 runs.
Final session of the day coming up 🔜
Scorecard ▶️ https://t.co/FM0hVG5X8M#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/CKtu2lqbKf
— BCCI (@BCCI) February 17, 2024
లంచ్కు ముందు 290/ 5తో పటిష్ట స్థితిలో కనిపించిన స్టోక్స్ సేన అనూహ్యంగా మరో 29 పరుగులకే చాప చుట్టేసింది. లంచ్ తర్వాత బంతి అందుకున్న జడేజా.. కెప్టెన్ బెన్ స్టోక్స్(41)ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే సిరాజ్ సూపర్ డెలివరీతో బెన్ ఫోక్స్(13)ను బోల్తా కొట్టించాడు. అప్పటికే ఆలౌట్ ప్రమాదంలో పడిన ఇంగ్లండ్.. పది పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు కోల్పోయింది.