అంటాల్య: నిలకడైన ప్రదర్శనతో సత్తాచాటిన అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీ త్రయం ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో స్వర్ణం కొల్లగొట్టింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో భారత జట్టు 232-231తో ఫ్రెంచ్ టీమ్ను చిత్తు చేసింది. రౌండ్ రౌండ్కు ఆధిక్యం చేతులు మారిన తుదిపోరులో అభిషేక్, రజత్, అమన్ తమ గురితో ఆకట్టుకున్నారు. కాంపౌండ్ మిక్స్డ్ డబుల్ ప్లే ఆఫ్స్ పోరులో అభిషేక్ వర్మ-ముస్కాన్ జంట 156-157తో క్రొయేషియా జోడీ చేతిలో ఓడి కాంస్యం చేజార్చుకుంది. ఆదివారం జరుగనున్న రికర్వ్ మిక్స్డ్ ఫైనల్లో భారత ద్వయం రిధి-తరుణ్దీప్ రాయ్ బరిలోకి దిగనుంది.