న్యూయార్క్: జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మావన హక్కుల మండలి(UNHRC)కి ఏడో సారి భారత్ ఎన్నికైంది. 2026 నుంచి 2028 వరకు యూఎన్హెచ్ఆర్సీ సభ్యదేశంగా భారత్ కొనసాగనున్నది. మంగళవారం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. భారత్కు చెందిన మూడేళ్ల కాలపరిమితి 2026 జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు యూఎన్హెచ్ఆర్సీ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నది. యూఎన్ భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ కూడా స్పందించారు. భారత్కు మద్దతు ఇచ్చిన వారికి ఆయన తన సోషల్ మీడియా పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. ఏడోసారి మానవ హక్కుల మండలికి ఎన్నికైనట్లు ఆయన పేర్కొన్నారు. తమ పదవీకాలంలో మానవ హక్కుల రక్షణ కోసం పాటుపడనున్నట్లు భారత్ చెప్పింది. యూఎన్ మానవ హక్కుల మండలిలో మొత్తం 47 సభ్యదేశాలు ఉన్నాయి.
India was elected to the Human Rights Council for the term 2026-28 @UN for the seventh time today. Thank all delegations for their overwhelming support.
This election reflects India’s unwavering commitment to human rights and fundamental freedoms. We look forward to serve this… pic.twitter.com/rvYj4jRKlY
— Parvathaneni Harish (@AmbHarishP) October 14, 2025