న్యూఢిల్లీ: అత్యంత వేగంగా రోడ్డు నిర్మించిన వరల్డ్ రికార్డు ఇండియా పేరిట నమోదైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. మార్చిలో ఇలా మూడు వరల్డ్ రికార్డులను నమోదు చేసినట్లు తెలిపారు. కేవలం 24 గంటల్లో 2.5 కిలోమీటర్ల 4 లేన్ల రోడ్డు నిర్మించినట్లు చెప్పారు. అంతేకాకుండా 24 గంటల్లోనే 25 కిలోమీటర్ల 1 లేన్ రహదారిని షోలాపూర్-బీజాపూర్ మధ్య నిర్మించినట్లు తెలిపారు.
ఫిబ్రవరి 1, 2021 ఉదయం 8 గంటలకు ప్రారంభించిన 2.5 కిలోమీటర్ల 4 లేన్ల రోడ్డును మరుసటి రోజు ఉదయం 8 గంటల కల్లా పూర్తి చేసి వరల్డ్ రికార్డు సృష్టించింది పటేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కాంట్రాక్టర్. 2020-21 సంవత్సరంలో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మొత్తం 13,394 కిలోమీటర్ల పొడువైన రహదారులను నిర్మించింది. నేషనల్ హైవేల నిర్మాణంలో ఇండియా గణనీయ పురోగతిని సాధించినట్లు ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు.
సచిన్.. నువ్వు కొవిడ్నూ సిక్స్ కొట్టగలవు: వసీం అక్రమ్
చెన్నై చేరిన డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్
గిఫ్ట్గా వచ్చిన మహీంద్రా థార్ కార్లతో నటరాజన్, శార్దూల్ పోజులు
వారణాసిలో సవాల్.. మోదీపై దీదీ పోటీ!
యూట్యూబర్ స్టంట్.. 50 గంటల పాటు సజీవ సమాధి.. వీడియో వైరల్
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
ఆ ఒక్క సిక్స్తోనే వరల్డ్కప్ గెలవలేదు: గంభీర్
టీ20 వరల్డ్కప్.. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇస్తారా?
డివిలియర్స్ ఆల్టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?