టోక్యో : ఒలిపింక్స్ హాకీలో స్పెయిన్పై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. పూల్-ఏ మూడో మ్యాచ్లో 3-0 తేడాతో గెలిచింది. ఇప్పటి వరకు భారత్ మూడు మ్యాచ్లు ఆడగా.. ఇందులో రెండింట్లో విజయం సాధించింది. మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్లో స్పెయిన్పై భారత జట్టు ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలిక్వార్టర్ ముగిసే సరికి స్పెయిన్పై 2-0 గోల్స్ ఆధిక్యంలో భారత్ నిలిచింది. మ్యాచ్లో రెండు గోల్స్తో రూపిందర్సింగ్ అదరగొట్టాడు. మ్యాచ్లో 15 నిమిషాలు, 51 నిమిషాల సమయంలో రెండు గోల్స్ వేసి, విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిమ్రన్జీత్ సింగ్ ఒక గోల్ సాధించాడు. మొదటి స్పెల్లో రెండు గోల్స్ చేసిన భారత జట్టు.. రెండవ స్పెల్లో కొంచెం రక్షణాత్మకంగా ఆడింది. స్పెయిన్ సైతం ఎదురుదాడికి దిగినా.. భారత్ ధీటుగానే ఎదుర్కొంది. స్పెయిన్కు రెండు పెనాల్టీ కార్నర్స్ లభించినా.. భారత్ ధీటుగా ఎదుర్కొని విజయాన్ని అందుకున్నది.