IND vs SL : 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. శివం మావి వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ పథుమ్ నిస్సంక బౌల్డ్ అయ్యాడు. అంతర్జాతీయ టీ20ల్లో మావికి ఇదే మొదటి వికెట్. ధనంజయ డిసిల్వా క్రీజులోకి వచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలలో 162 రన్స్ చేసింది. ఆల్రౌండర్లు దీపక్ హుడా 41, అక్షర్ పటేల్31 ఆఖర్లో దూకుడుగా ఆడడంతో గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది.
శుభ్మన్ గిల్ (7) సూర్యకుమార్ యాదవ్ (7)లు వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్ ఒత్తిడిలో పడింది. సంజూ శాంసన్ (5 మళ్లీ నిరాశ పరిచాడు. ఇషాన్ 37 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. ఆ వెంటనే పాండ్యా 39 పరుగులు చేసి వెనుదిరిగాడు. శ్రీలంక బౌలర్లలో మధుషనక, తీక్షణ, కరుణరత్నే, డిసిల్వా, హసరంగ తలో వికెట్ తీశారు.