వాషింగ్టన్, నవంబర్ 3: హెచ్-1బీ ఆశావహులకు షాక్ ఇచ్చే వార్త ఇది. ప్రతిపాదిత ‘బడ్జెట్ రీకాన్షిలియేషన్ బిల్లు’కు అమెరికా చట్టసభలు ఆమోదం తెలిపితే.. హెచ్1బీ వీసా మరింత భారం కానున్నది. వీసా దరఖాస్తు ఫీజుకు సప్లిమెంటరీ ఫీజు కింద అదనంగా 500 డాలర్లను (రూ. 37,280) వసూలు చేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే, హెచ్-1బీ వీసాతో అగ్రరాజ్యానికి వెళ్లే భారత ఐటీ నిపుణులపై ఆర్థిక భారం మరింతగా పెరుగనున్నది.